మహానంది ఆలయానికి రెండు కోట్ల భారీ విరాళం ఇచ్చిన భక్తుడు

Read Time:  1 min
mahanandi
mahanandi
FONT SIZE
GET APP

నంద్యాల జిల్లా గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ రాజు, మహానంది ఆలయానికి తన అపార భక్తిని చాటుతూ దేవస్థానానికి భారీ విరాళం అందించారు. ఆయన 2 ఎకరాల 10 సెంట్ల భూమి, 5 సెంట్ల ఇంటిని దానం చేయడంతో మొత్తం విలువ రూ.2 కోట్లకు చేరింది.

ఇది మాత్రమే కాకుండా, రాజు గతంలో ఒక ఎకరం పొలాన్ని కూడా ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఇంకా వివాదంలో ఉన్న మరో ఎకరాన్ని కూడా వివాద పరిష్కారం అనంతరం దేవస్థానానికి అప్పగిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ ఔదార్యానికి సాక్ష్యంగా ఆలయ అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి, ఈఓ శ్రీనివాస రెడ్డి ఘన సన్మానం చేశారు. ఈ భారీ విరాళం ఆలయ అభివృద్ధికి పునాది వేస్తుందని భక్తులు అభినందిస్తున్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.