📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

పోలీసుల సూచనలతో వెనుతిరిగిన మంచు మనోజ్‌

Author Icon By Vanipushpa
Updated: January 16, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మోహన్‌బాబు, మంచు మనోజ్‌ల మధ్య రోజుకో మలుపు తిరుగుతూ జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీకి మంచు మనోజ్‌ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు జరిపిన చర్చలతో మంచు మనోజ్‌ తన తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. అయితే తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.

అనంతరం ఆయన పోలీసు స్టేషన్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదని, సంక్రాంతి పండుగను కూతురుతో కలిసి జరుపుకుందామని వచ్చానని తెలిపారు. అయితే రెండు రోజుల పాటు తనను పండుగను జరుపుకోకుండా ఆటంకాలు సృష్టించారని మీడియాకు వివరించారు.తాను తిరుపతికి వస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్లను చించివేయడం, అభిమానులను బెదిరించడం సరికాదని అన్నారు. ఫ్యాన్స్‌ను బెదిరించకుండా ఉంటే సైలెంట్‌గా ఉండేవాడినని తెలిపారు. తన కుటుంబ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో గాని, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే నానికి వివరించ లేదని, సహాయం చేయాలని కూడా ఎవరినీ అడగలేదని వెల్లడించారు.

Andhra Pradesh Manchu Manoj Mohan Babu tirupathi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.