📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ

Author Icon By Sudheer
Updated: November 30, 2024 • 7:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం పేరిట రూ.4 వేల ఫించన్‌ సక్రమంగా పంపిణీ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి అనంతపురం జిల్లాలో పర్యటించి సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లాలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు అనంతపురంలోని నేమకల్లులో లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు ఉ.11.40 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయల్దేరుతారు. 12.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు.

గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు. హంగు ఆర్భాటాలకు దూరంగా.. సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామానికి శనివారం చంద్రబాబు చేరుకుంటారని వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి హెలిప్యాడ్‌ స్థలాన్ని, ఆంజనేయస్వామి దేవాలయాన్ని, గ్రామసభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Ap Chandrababu Distribution of pensions in AP today pensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.