📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

నాలెడ్జ్ హబ్‌గా ఏపీని నిలపడమే లక్ష్యం – సీఎం చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: December 6, 2024 • 7:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం : అత్యాధునిక సాంకేతికత – ఇన్నోవేషన్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, ఈ విషయంలో ముందుండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా నిలిపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేతృత్వంలో నిర్వహించిన ‘నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్’ సదస్సులో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశామనేది వివరించారు. 1996లో ఐటీ గురించి మాట్లాడిన నేను, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామని అన్నారు. నాడు పైసా ఖర్చు లేకుండా కేవలం భూమి మాత్రమే ఇచ్చి పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించిన్నట్లు చెప్పారు.


నాడు ఉమ్మడి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడానికి అమెరికా వెళ్లి ఐటీ పెద్దలను కలిసి భారతీయుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యం గురించి వివరించిన్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు 20 విద్యా సంస్థలు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 నుండి 250 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహించామని, నాడు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆనాడు స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యత గురించి మాట్లాడితే తనను ప్రశ్నించారని అన్నారు. కానీ నేడు మన జీవితంలో టెక్నాలజీ భాగమైంది. ఐటీని ఉపయోగించుకోకపోయి ఉంటే ఆర్థిక వ్యవస్థలో మిగతా దేశాలతో పోటీ పడేవాళ్లం కాదని చెప్పారు.ఒక్కప్పుడు అధిక జనాభా వల్ల నష్టాలు ఉంటాయని భావించామని, కానీ, ఇప్పుడు అదే మన ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు జనాభా తక్కువ సమస్య ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడని తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్తూ జనాభా- టెక్నాలజీ రెండూ అవసరమన్నారు. “ఫోర్ పి” నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విశాఖ నగరం భవిష్యత్ నాలెడ్జి హబ్ అంటున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రక్షిత తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీరు అందిస్తున్నామన్నారు.

జీరో బడ్జెట్ నేచురల్ ఫ్రామింగ్ డెవెలప్ మెంట్ నినాదంతో వెళ్తున్నామన్నారు. వెయ్యి కిలోమీటర్లు తీరం ఉందని, సముద్ర రవాణా మీద బాగా దృష్టి పెట్టామని వెల్లడించారు. లాజిస్టిక్ కార్గో కేవలం 14 % ఉందన్నారు. మన రాష్ట్రమే మొదటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిందని, పవర్ సెక్టార్ లో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని తెలిపారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ కూడా మన రాష్ట్రం నుంచి ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫామేషన్ ఇండియా టూ వికసిత భారత్, ఏ ఐ ఫర్ ఎవ్రీ వన్ అనే రెండు పుస్తకాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

Ap Chandrababu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.