📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

డోకిపర్రు గ్రామాన్ని సందర్శించనున్నచంద్రబాబు

Author Icon By Vanipushpa
Updated: December 14, 2024 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని శనివారం సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. గ్రామంలోని శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆలయ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక పూజ
ఆలయ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు విజయవాడ (గన్నవరం) ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 8.30గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 3.45 గంటలకు ఉండపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు బయలుదేరి 4.00 గంటలకు డోకిపర్రు గ్రామానికి చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు.
కాగా, సీఎం హెలికాఫ్టర్‌లో డోకిపర్రు రానున్న దృష్ట్యా స్థానిక మేఘా సంస్థ ఫార్మ్ హౌస్ ఎదుట పొలాల్లో హెలిపాడ్ నిర్మాణానికి ఎస్పీ, కలెక్టర్ నిన్న పరిశీలించి అనుమతి ఇచ్చారు. దీంతో మేఘా సంస్థ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన హెలిపాడ్ నిర్మాణ పనులు చేపట్టారు. చంద్రబాబు పూజలు చేసే ప్రాంతాన్ని ఎస్పీ, కలెక్టర్ పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆలయ ప్రతినిధులకు సూచనలు చేశారు.

AP Assembly Chandrababu temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.