📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు

Author Icon By Vanipushpa
Updated: January 15, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి కనుమ సందర్బంగా తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. కనుమ రోజున పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300 కు పైగా బరులు ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్టు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ పందాలు, జూదం జరిగినట్టు సమాచారం. మురమళ్ళలో వీఐపీలో బరి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పందాలు జరిగినట్టు అంచనా. కొన్ని చోట్ల విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేస్తున్నారు. ఆత్రేయపురంలో విజేతలకు బుల్లెట్లను బహుమతులు అందజేశారు.

ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు
అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. పందాలకు ఈరోజు వరకు అనుమతి ఉంది. సాయంత్రం నుంచి పందాలకు అనుమతి లేదంటూ ప్రచారం జరుగుతోంది. రెండు రోజులుగా సాగుతున్న కోడిపందాల్లో రూ.300 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాల ముసుగులో యధేచ్ఛగా పేకాట, గుండాట జరుగుతున్నాయి. ప్రతీ కోడి పందెం శిబిరం వద్ద మద్యం బెల్ట్ షాపులు కూడా వెలిశాయి.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సాంప్రదాయ ముసుగులో భారీ ఎత్తున జూద క్రీడలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం టెర్మినల్‌లో జూద క్రీడలు క్యాసినోను తలపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌ గ్రూప్ సంస్థ జూద క్రీడలు నిర్వహిస్తోంది. బౌన్సర్‌లను పెట్టి మరీ ఆర్‌ఆర్ గ్రూప్ సంస్థ పేకాట శిబిరాలను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఇబ్రహీంపట్నంకు హైదరాబాద్ కల్చర్‌ను పరిచయం చేసింది. ఇంత జరుగుతున్నప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. భారీ ఎత్తున ముడుపులు చెల్లింపులు జరిగినట్లు సమాచారం.

Andhra Pradesh on going rooster racing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.