📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జోగి రమేశ్ తో పరిచయం లేదు: కొనకళ్ల నారాయణ

Author Icon By Vanipushpa
Updated: December 18, 2024 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కలవడం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే గౌతు శిరీషలతో పాటు వేదికను పంచుకున్నారు. అంతేకాదు టీడీపీ నేతలతో కలిసి వాహనంపై ఊరేగారు. దీంతో, ఈ ముగ్గురు టీడీపీ నేతలపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తితో కలిసి వేదికను పంచుకోవడం ఏమిటని ఏకిపారేస్తున్నారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు.
పార్టీకి ద్రోహం చేయను
ఈ నేపథ్యంలో కొనకళ్ల నారాయణ స్పందిస్తూ… జోగి రమేశ్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై చంద్రబాబును కలిసి వివరిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తాను ఎప్పుడూ చేయనని… ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని, అనుకోకుండా జరిగిందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకే తాను వెళ్లానని… జోగి రమేశ్ తో తనకు ఎలాంటి పరిచయాలు లేవని తెలిపారు. జోగి రమేశ్ వస్తున్నట్టు తనకు సమాచారం లేదని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదనే ఉద్దేశంతోనే జోగి రమేశ్ వచ్చినప్పటికీ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని తెలిపారు.
నానికి శిక్ష తప్పదు
రేషన్ బియ్యం మాయం అయిన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని శిక్ష అనుభవించక తప్పదని నారాయణ చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని దోచుకుతున్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. పక్కదారి పట్టిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుంచి బయటపడలేరని చెప్పారు.

jogi ramesh konakalla narayana TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.