📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

చంద్రబాబు పాలన బాగుంది: ఎంపీ కృష్ణయ్య

Author Icon By Vanipushpa
Updated: January 8, 2025 • 12:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా బాగుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు పాలన బాగుందని..మంచి పరిపాలన దక్షుడని.. విజనరీ ఉన్న నేతని… సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మేధావులలోనూ, విద్యావేత్తలలో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే… కరిగిపోయే మనస్సున్న నేత పవన్ కల్యాణ్ అని ఆర్ కృష్ణయ్య అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారని, ప్రధానికి నీరాజనం పట్టడానికి విశాఖ ప్రజలు సిద్దం అయ్యారన్నారు. విశాఖ ప్రాంతం అభివృద్దికి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్ అన్నిరంగాలలో గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందన్నారు.

ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్‌టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.

Andhra Pradesh Chandrababu Naidu r.krishnaiah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.