📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి: అమర్నాథ్

Author Icon By Vanipushpa
Updated: January 9, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితులకు ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధకరమని అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లడ్డూని రాజకీయం చేశారు.. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇందుకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. మోదీ భజన మానేసి తిరుపతిలో భక్తుల, సౌకర్యాల మీద దృష్టి పెడితే ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ సనాతన దీక్ష, హిందూ ధర్మ దీక్ష చేశారు ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అన్నారు.

ఈ పాప పరిహారం ఎలా సరిదిద్దుకుంటారో, సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స్పష్టమైన ప్రకటన ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. నిన్న మోదీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. ఏపీ అభివృద్ధిపై మోదీ కట్టుబడి ఉన్నారా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట.. ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

ex gratia Gudivada Amarnath TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.