📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు – మంత్రి డా.నిమ్మల రామానాయుడు

Author Icon By Sudheer
Updated: December 5, 2024 • 11:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం అనే ఉద్దేశ్యంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగు నీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్దరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు.

సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకు, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేవా దృక్పధంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతి నిధులుగా ఉండటం ఎంతో అవసరమని, అటు వంటి ఎన్నికల్లో ఎటు వంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతి నిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దేశానికి వెన్నెముఖ అయిన రైతాంగం సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2015 లో తమ ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా ప్రతి నిధులను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

అయితే గత ప్రభుత్వం వాటి విలువను గుర్తించ కుండా 2020లో సాగు నీటి సంఘాలను అన్నింటినీ రద్దు చేయడం జరిగిందన్నారు. రైతులు, వ్యవసాయం పై గత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యదోరణికి ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం సాగు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు ఎటు వంటి నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టులను అన్నింటినీ గాలికి వదిలేసిందన్నారు.

ఫలితంగా గుండ్లకమ్మ, పులిచింతల, అన్నమయ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోవడం జరిగిందన్నారు. ఈ మద్య రైవస్ కెనాల్ గేటు కూడా కొట్టుకు పోయినట్లు ఆయన తెలిపారు. అటు వంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకై తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Ap irrigation societies elections minister nimmala ramanaidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.