📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఇప్పట్లో తల్లికి వందనం లేనట్టేనా!

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం అమలు చెయ్యట్లేదనే వార్త బయటకు రావడమే. దీన్ని 2025 విద్యా సంవత్సరం నుంచి అమలు చెయ్యాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే.. 2025 జూన్‌లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మరి 2024 విద్యా సంవత్సరం సంగతేంటి? ఈ విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సంగతేంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అప్పులు చేసిన తల్లిదండ్రులు
తల్లికి వందనం పథకం కింద.. ప్రతీ విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక, మొదటి ఆర్థిక లేదా విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చెయ్యట్లేదని తెలుస్తోంది. ఈ పథకం అమలవుతుందనే ఆలోచనతో.. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లల స్కూళ్ల ఫీజుల కోసం అప్పులు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కూడా కాలయాపన
గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఎన్నికల ఏడాదిలో… అప్పటి సీఎం జగన్.. చివరి ఏడాది ఇవ్వాల్సిన అమ్మఒడి డబ్బు ఇవ్వలేదు. అలాగే కాలయాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

ఆ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మనీ ఇవ్వకపోవడంతో.. రెండోసారి మళ్లీ అప్పులు చేసి, ఫీజులు కడుతున్నారు.
పోటి రాజకీయాలతో ప్రజలకు ఇబ్బంది
గత ప్రభుత్వంలో జగన్.. ఒక బిడ్డ చదువుకే రూ.13,000 చొప్పున ఇస్తూ వచ్చారు. ఐతే.. అందులో రూ.2,000 కోత పెట్టి.. ఆ డబ్బును స్కూళ్లలో పారిశుధ్యం కోసం వాడారు. ఇలా మూడేళ్లు ఇచ్చారు. తర్వాత ఎన్నికలు ఏడాదిలో ఇవ్వకుండా తాత్సారం చేసి.. చివరకు ఊరుకున్నారు.

Andhra Pradesh CM chandrababu talliki vandanam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.