📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ముందు వీరికే ప్రాధాన్యం – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: December 5, 2024 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అవినీతి, రాజకీయ ప్రయోజనాలకు ఇందులో చోటు లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
గ్రామసభల ద్వారా అర్హుల ఎంపిక చేయడం, AI సాయం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు వంటి చర్యలతో పథకం న్యాయంగా అమలవుతుందని సీఎం వివరించారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు.

పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. ఇందిరాగాంధీ ప్రారంభించిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా బడుగు వర్గాలకు గౌరవం దక్కిందని గుర్తుచేశారు. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అంతేకాక, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రతీ రాజకీయ నాయకుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని, అందరికీ సహకారం కావాలని కోరారు. పాలకులు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు సభకు హాజరై ప్రజల కోణంలో పాలకపక్షాన్ని ప్రశ్నించాలని సూచించారు. చిన్నపిల్లల మానసికతతో వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదని, సమన్వయం అవసరమని సూచించారు.

cm revanth Indiramma Housing Scheme Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.