మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనుమడు విష్ణు-సాయిసాత్విక నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా గుంటూరులోని శ్రీ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిధిగా హాజరై, నూతన జంటకు తన శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్యనాయుడు కూడా చంద్రబాబును ఆహ్వానించి, వేడుకలో అతిధిగా అందరి ముందు ఆయనను గౌరవించారు. అంతకుముందు, అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగిన తరువాత, చంద్రబాబు నేరుగా గుంటూరుకు రావడం జరిగింది. ఈ వేడుకకు టిడిపి కి చెందిన పలువురు నేతలతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరై సందడి చేసారు.
అట్టహాసంగా వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ వేడుక
By
Sudheer
Updated: October 24, 2024 • 6:35 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.