ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.జగన్ (On Jagan’s behavior) ప్రవర్తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి కూడా దగ్గరకి రానివ్వని జన్మ ఎందుకు? అంటూ మండిపడ్డారు. మహిళలను అవమానిస్తూ జగన్ ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు.జగన్ చేసే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి అన్నారు. “ఇలాంటి రాజకీయాలు నీకు అవసరమా? నువ్వు సమకాలీన రాజకీయాలకు అనర్హుడివి,” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

వైసీపీ భవిష్యత్తు లేదని స్పష్టం
ఆనం మాట్లాడుతూ, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. వైసీపీ త్వరలో కనుమరుగవుతుంది. ఇక తిరిగి కోలుకునే పరిస్థితి ఉండదు, అని స్పష్టం చేశారు.వైసీపీలో ఎవరైనా విజ్ఞులు మిగిలి ఉంటే వారు ఆలోచించి బయటకు రావాలి. లేకపోతే జగన్తో పాటే మీరు కూడా మునిగిపోతారు, అని ఆనం హెచ్చరించారు.
జగన్ను రౌడీల అధినేతగా ఎద్దేవా
జగన్ను విమర్శిస్తూ, అతను రౌడీల అధినేతా, లేక గంజాయి గ్రూపుల నాయకుడా అర్థం కావడం లేదు, అని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు బయటపడతాయని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైసీపీపై విమర్శలను మరింత పెంచాయి.
Read Also : Tirupati : తిరుపతిలో అధిక శబ్ద వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్