నేషనల్ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య 40 నిమిషాల పాటు కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం నుండి మరింత ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు వినతి చేశారు. రాష్ట్రంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల కోసం నిధులు అవసరమని ఆయన వివరించారు. ముఖ్యంగా పునర్నిర్మాణ పనుల్లో కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు.
గవర్నర్ పదవికి ధన్యవాదాలు – ప్రాజెక్టుల వివరాలు
ఈ సందర్భంగా ఇటీవలే అశోక్ గజపతిరాజు గవర్నర్గా నియమితుడైనందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ వివరాలను అమిత్ షా (Amith Sha) ముందు ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును రూ.82 వేల కోట్లతో ప్రతిపాదించామని, దీని ద్వారా జలవనరుల సమర్ధ వినియోగం సాధ్యమవుతుందన్నారు. గోదావరి మిగులు జలాలపై ఏపీకి పూర్తి హక్కు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కేంద్రం – రాష్ట్ర సమన్వయానికి సానుకూల వాతావరణం
ఈ సమావేశం ద్వారా కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయానికి మార్గం సుళువయ్యింది. ఆర్థిక వనరుల పై స్పష్టతకు తోడుగా, ముఖ్యమైన జల ప్రాజెక్టుల ప్రాధాన్యతను కేంద్రానికి వివరించిన చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆశిస్తున్నారు. త్వరలోనే మరిన్ని భేటీలు జరుగనున్న సూచనలు కూడా ఉన్నట్లు సమాచారం.
Read Also : Rahul : జైశంకర్ చైనా పర్యటన.. రాహుల్ గాంధీ ఫైర్