స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ – అంబేద్కర్ పాత్ర
భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇద్దరూ అత్యంత ప్రభావవంతమైన నాయకులు. ఒకవైపు గాంధీ జీ స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు అహింసా ఆయుధంగా వాడిన మానవతావాది కాగా, మరోవైపు అంబేద్కర్ భారతదేశ ప్రజాస్వామ్య పునాది అయిన రాజ్యాంగాన్ని రూపొందించిన, సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహానాయకుడు. ఒకరు సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసించి మత సామరస్యం కోసం శ్రమిస్తే, ఇంకొకరు అదే హిందూ ధర్మంలో ఉన్న కులవివక్షను ధ్వంసం చేయాలని ఆశించారు. అందుకే వీరి ఆలోచనలు పరస్పర విభిన్నంగా మారాయి.
అంబేద్కర్ బాల్యం: తక్కువతనంతో నిరంతర పోరాటం
1891లో మహారాష్ట్రలోని మహర్ కులంలో జన్మించిన అంబేద్కర్ చిన్నప్పటి నుంచే భయంకరమైన వివక్షకు గురయ్యారు. స్కూల్కు ఇటుక తీసుకెళ్లడం, నీళ్లు తాగేందుకు ప్రత్యేక కుండను వాడుకోవడం, ప్యూన్ లేకపోతే నీళ్లు దొరకని దుస్థితి – ఇవన్నీ ఆయనను శారీరకంగా కాకపోయినా మానసికంగా గాయపర్చాయి. అయినా కూడా, విద్యపై గాఢమైన విశ్వాసంతో అంబేద్కర్ గారు కోలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. అయినా, భారతదేశంలో ఆయనను తక్కువ కులవాడిగా చూసే దుర్వినియోగం ఆగలేదు. ఈ అనుభవాల వలన అంబేద్కర్కి కులవ్యవస్థపై శాశ్వతమైన అనుమానాలు, లోతైన వ్యతిరేక భావాలు పెరిగాయి.
గాంధీ దృక్పథం: మత సామరస్యం, కానీ కులం వ్యవస్థపై నమ్మకం
మహాత్మాగాంధీ సనాతన హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతర మతాలను కూడా గౌరవించేవారు. ఆయన కులవ్యవస్థను ధర్మంగా భావించినప్పటికీ, అంటరానితనాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేవారు. హరిజనుల హక్కుల కోసం 1932లో హరిజన్ సేవక్ సంఘ్ స్థాపించి, దేవాలయ ప్రవేశాల వంటి కార్యక్రమాలు చేపట్టారు. “అంటరానితనం మహా పాపం” అని గాంధీని అనగా – ఆయన దానిని నిర్మూలించాలనే ధ్యేయంతో పయనించారు. కానీ, కులవివక్షను వ్యవస్థగా చూసిన అంబేద్కర్కు ఈ దృక్పథం సరిపోలలేదు.
సెపరేట్ ఎలక్టోరేట్పై ఘర్షణ
అంబేద్కర్, దళితులకు ప్రత్యేక ఎన్నికల ప్రాతినిథ్యం అవసరమని నమ్మారు. 1930-32 రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని దళితుల ప్రత్యేక ఎలక్టోరేట్ పట్ల ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ గాంధీ, ఇది హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో పూనా ఒప్పందంతో చివరకు ఒక రాజీకి వచ్చారు – దళితులకు ప్రత్యేక ఓటింగ్ హక్కు కాకుండా, రిజర్వేషన్ ద్వారా ప్రతినిధిత్వం కల్పించాలని అంగీకరించారు. ఇది వీరి మధ్య ఉన్న విభేదాలను మరింత స్పష్టంగా చేసింది.
బౌద్ధమత స్వీకరణ: ధర్మపరిరక్షణ కోసం శరణాగతి
అఖండ కులవివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్ 1956లో నాగ్పూర్లో లక్షలాది అనుచరులతో కలిసి బౌద్ధమతంలో ప్రవేశించారు. ఆయన చేసిన 22 ప్రతిజ్ఞలు హిందూ మతాన్ని పూర్తిగా తిరస్కరించేవిగా ఉండటంతో, కొన్ని వర్గాలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ అంబేద్కర్ దృక్పథంలో అది సామాజిక విముక్తికి ఒక మార్గం.
జై భీమ్ నినాదం: అంబేద్కర్ ఆలోచనలకు నూతన రూపం
“జై భీమ్” నినాదం అంబేద్కర్ ఆలోచనల సంకేతంగా దేశమంతటా వినిపిస్తోంది. ఉత్తర భారతంలో ఇది ఉద్యమాల నినాదంగా మారింది. భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ పేరులోని “భీమ్”ను జై నినాదంగా మార్చి సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచింది.
READ ALSO: Ambedkar: బీఆర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, సీఎం లు