జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆలోచనలలో గందరగోళం, రోజువారీ పనుల నిర్వహణలో సమస్యలు.. ఇవే ఆల్జీమర్స్ వ్యాధి లక్షణాలు. ఇది మానసిక నాడీ వ్యవస్థ క్రమంగా క్షీణించే రోగం. ప్రస్తుతానికి దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కొన్ని మందులు మాత్రమే తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి.చైనాలో ఇటీవలి కాలంలో ఎల్వీఏ సర్జరీ అనే పద్ధతి ఆల్జీమర్స్ చికిత్సగా (Alzheimer’s surgery) బాగా ప్రాచుర్యం పొందింది. లింఫాటిక్ వేనస్ అనస్టోమోసిస్ (ఎల్వీఏ) పేరుతో ఈ సర్జరీని ప్రైవేటు ఆసుపత్రులు విస్తృతంగా వినియోగించాయి. అయితే దీనిపై జాతీయ ఆరోగ్య కమిషన్ (National Health Commission) తాజాగా నిషేధం విధించింది.

సురక్షతపై ఆధారాలు లేవు – కమిషన్ హెచ్చరిక
ఈ చికిత్స సురక్షితమా, సమర్థవంతమా అన్నది నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవని అధికారులు తేల్చారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వైద్యాధికారులకు ఎల్వీఏ చికిత్సను తక్షణం నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.2019లో మొదలైన ఈ చికిత్సకు నాలుగేళ్లలో 382 ఆసుపత్రులు అనుసరించాయి. ఝెజియాంగ్ రాష్ట్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి దీనికి బీజం వేసింది. ఓ మైక్రోసర్జరీ నిపుణుడు మొదటిసారిగా ఇది ప్రవేశపెట్టాడు. ఆ తరువాత ప్రతి రాష్ట్రంలో దీన్ని అమలు చేశారు.
వైరల్ అభిప్రాయాలు – నిపుణుల ఆందోళన
60-80 శాతం రోగులకు ఇది పనిచేస్తుందని కొందరు వైద్యులు తెలిపారు. వారి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అదే సమయంలో పలు వైద్య నిపుణులు దీని భద్రతపై గంభీర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికారుల దృష్టికి వెళ్లి చర్యలకు దారితీసింది.ఇలాంటి వైద్య పద్ధతులు ప్రజల ఆశలు రెప్పపాటు కాలంలో పెంచినా, శాస్త్రీయ ఆధారాలు లేకుండా అమలు చేస్తే ప్రమాదమే. చైనా ఈ చర్య ద్వారా ప్రపంచానికి ఒక సూచన ఇచ్చినట్లయింది.
Read Also : Dola Sri Bala Veeranjaneya Swamy : నర్సింగ్ చదివిన ఎస్సీ యువతకు గుడ్ న్యూస్