గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఆ ప్రాంతాన్ని కలకలం రేపుతోంది. ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన B787 డ్రీంలైనర్ విమానం, లండన్కు బయలుదేరిన కొద్ది క్షణాలకే తక్షణమే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో కలిపి ప్రయాణిస్తున్నారు.

ప్రమాదానికి ముందు పరిస్థితి
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు రన్వే 23 నుంచి బయలు దేరింది. కొద్ది సేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అధికారులు పరిశీలించగా ఎయిర్పోర్టు సమీపంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఘటనా స్థలంలో ఘోరం
అహ్మదాబాద్లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్ఇండియా, ఇటు ఎయిర్పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.
అధికారుల స్పందన
ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత, అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.
ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు.
Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్