మహిళలపై దాడి కేసులో కేరళలో నిందితుడు అరెస్ట్

Bengaluru Case: మహిళలపై దాడి కేసులో కేరళలో నిందితుడు అరెస్ట్

బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద ఒక సందులో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరి మహిళల్లో ఓ మహిళలపై ఒక వ్యక్తి దాడి చేసి అఘాయిత్యానాకి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Advertisements
బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద ఒక సందులో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌లో..

26ఏళ్ల సంతోష్‌గా గుర్తింపు..
సీపీఫుటేజ్ ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బెంగళూరులోని ఓ జాగ్వార్‌ షోరూమ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 26ఏళ్ల సంతోష్‌గా గుర్తించారు. ఇక అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతను బెంగళూరు నుండి తమిళనాడులోని హోసూర్‌కు పారిపోయినట్టు కనుగొన్నారు. ఆ తర్వాత సేలం, అక్కడి నుంచి కోజికోడ్‌కు పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మూడు రాష్ట్రాల్లోని 700 సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు చివరకు కేరళలోని ఒక మారుమూల గ్రామంలో అతన్ని పట్టుకోగలిగారు. దాదాపు వారం పాటు కొనసాగిన వేటను ముగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాజకీయ వివాదానికి దారితీసిన దాడి
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఇంతపెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజమని..అయినా చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీఅయిన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలపై నేరాలను ఆయన సాధారణీకరిస్తున్నారా? ఆయన్న వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: Murder: ఆస్తి కోసం మహిళకు మద్యం తాగించి హత్య చేసిన బంధువులు

Related Posts
పుల్వామా దాడిపై మోదీ ట్వీట్
వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల

ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ను ప్రేమికులరోజు గా జరుపుకుంటారు కానీ మన భారతదేశంలో మాత్రం ఇది ఒక విషాదకరమైన రోజు గా చెప్పుకోవచ్చు .ఎందుకంటే 2019 ఫిబ్రవరి Read more

Madhya Pradesh: ప్రియుడి స్నేహితుల‌తో క‌లిసి భ‌ర్త‌ను హత్య చేసిన భార్య‌
Madhya Pradesh: ప్రియుడి స్నేహితుల‌తో క‌లిసి భ‌ర్త‌ను హత్య చేసిన భార్య‌

ప్రేమ పిచ్చితో కిరాతక హత్య: బీరు సీసాతో 36 సార్లు పొడిచి భర్తను హతమార్చిన మైనర్ భార్య, ప్రియుడు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. Read more

క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మోదీ
క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ప్రసిద్ధ బాగేశ్వర్‌ ధామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బాగేశ్వర్‌ ధామ్‌ పీఠాధిపతి Read more

‘ఏక్ హై టు సేఫ్ హై’ : దేశ భవిష్యత్తు కోసం మార్గదర్శక నినాదం..
narendra modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదవాళ్లను, ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ వారిని చిన్న చిన్న సమూహాలుగా విభజించేందుకు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×