ACB: ఎసిబికి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య

Read Time:  1 min
ACB: ఎసిబికి చిక్కిన డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య
FONT SIZE
GET APP

జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలో ఏర్పాటవుతున్న నీమ్డ్ భూములు (Neemed lands) కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం చెక్కులను ఇచ్చేందుకు జహీరాబాద్లోని నీమ్ భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్యలు రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసూత బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ (ACB) అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

మెదక్ రీజియన్ ఏసీబీ (ACB) డిఎప్పి సుదర్శన్ (DPP Sudarshan) మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం న్యాల్కల్ మండలంలోని హుసెళ్లి గ్రామ పరిధిలోని ఒక రైతుకు సంబంధించిన మూడు ఎకరాల 21 గుంటల భూమి నీమ్హ కోల్పోవడంతో సదరు రైతుకు 52 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించింది. అందుకు సంబంధించిన చెక్కును రైతుకు ఇచ్చేందుకు డిప్యూటీ కలెక్టర్ రాజు 50 వేల రూపాయలను, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ 15వేల రూపాయలను లంచంగా తీసుకుంటుడగా పట్టుకున్నామన్నారు. దీప్తి కలెక్టర్కు ఇవ్వాల్సిన 50వేల రూపాయలను తన ఇంటి వద్ద ఇవ్వాలని బాధితుడికి తెలిపారని డిఎస్పి వివరించారు. సదరు బాధితుడికి సంబంధికి సంబంధించిన బంధువుల కేసును పరిష్కరించేందుకు డ్రైవర్ దుర్గయ్య లక్ష రూపాయలు డిమాండ్ చేశారని, డ్రైవర్ను సైతం పట్టుకున్నామన్నారు. డబ్బులు తీసుకున్నట్లు కెమికల్ పరీక్షలో తేలిందని డిఎస్పి వివరించారు. ముగ్గురిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హజరు పరిచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని డిఎస్పి సూచించారు .

ఏసీబీ అధికారి విధులు?

ప్రభుత్వ వినియోగం కోసం లేదా స్వయం-మోటో చర్య కోసం ప్రభుత్వ ఆదాయం అవినీతి/ లీకేజీకి సంబంధించి తనిఖీ/మూల నివేదికలను రూపొందించడం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి-విద్యార్థి, యువజన సంఘాలు విజప్తి

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.