ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ Deputy Pawan Kalyanను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఆయనను ఉద్దేశిస్తూ అవమానకరంగా తయారు చేసిన ఈ ఫేక్ ఫొటోలు పలువురిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై జనసేన నాయకులు (Jana Sena leaders) కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రోజున చెల్లుబోయిన సతీష్కుమార్, దానం లాజర్బాబు తదితరులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సోషల్ మీడియా ఖాతాల్లో వేగంగా వ్యాప్తి చెందిన ఈ ఫోటోలను పోలీసులకు చూపించారు.
మార్ఫింగ్ చేసి కుక్క ఫోటో పెట్టిన దుర్మార్గులు
ర్యాండమ్ ఫారెస్ట్ అనే పేజీతో పాటు కొన్ని ఇతర అకౌంట్లలో పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫ్ చేసి కుక్కతో మారుస్తూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారని జనసేన నేతలు తెలిపారు. “వైజాగ్లో ఉప ముఖ్యమంత్రి యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్నారు” అంటూ సెటైరిక్ వ్యాఖ్యలు కూడా జత చేశారు.
మోదీ, చంద్రబాబు ఉన్న వేడుకను లైవ్లోనే అవహేళన
ఇటీవల జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ వేడుకను తగ్గించిచూపించేందుకు చేసిన ప్రయత్నంగా ఈ పోస్టులను చూస్తున్నారు జనసేన శ్రేణులు.
దుష్ప్రచారానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి
ఈ చర్యలు పవన్ కళ్యాణ్ పరువు నాశనం చేయాలనే ప్రయత్నమని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన సోషల్ మీడియా వేదికలు ఈ విషయంలో నిబంధనలు పాటించాలంటున్నారు.
Read Also : Visakhapatnam : విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక