ఒక్క గులాబీ మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎక్కడంటే!

Rose plant: ఒక్క గులాబీ మొక్క ఖరీదు రూ.12లక్షలు- ఎక్కడంటే!

తమిళనాడుకు చెందిన ఓ రైతు ఎడారి గులాబీ మొక్కలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఏటా రూ.50లక్షలు నుంచి రూ.60 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఒక్కో మొక్కను రూ.12లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అసలు ఎడారి గులాబీ మొక్కకు ఎందుకు అంత ధర? రైతు మొక్కల సాగులో అవలంభిస్తున్న విధానాలు ఏంటో మీరు చదవండి.

ఒక్క గులాబీ మొక్క ఖరీదే రూ.12లక్షలు- ఎక్కడంటే!

40 ఏళ్ల క్రితం సాగు ప్రారంభం
తిరువల్లూర్​లోని ఈసనమ్ కుప్పంకు చెందిన జలంధర్ అనే రైతు 40 ఏళ్ల క్రితం ఎడారి గులాబీ మొక్కల సాగును ప్రారంభించారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కలను పెంచుతున్నారు. మొత్తం 450 రకాల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రతి ఎడారి గులాబీ మొక్క మూడు వేర్వేరు రకాల పువ్వులను పూస్తోంది.
‘రూ.12 లక్షలకు ఒక మొక్క అమ్మకం’
“చిన్న వేర్లు ఉన్న మొక్కలు రూ.150కు అమ్ముతాం
. మందపాటి వేర్లు ఉన్నవి రూ. 12 లక్షల వరకు అమ్ముడుపోతాయి. ఈ ఎడారి గులాబీ మొక్కలు ప్రపంచంలోని మూడు ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చెన్నై, వియత్నాం, థాయిలాండ్​లో మాత్రమే లభిస్తాయి. రూ.12 లక్షలకు అమ్ముడయ్యే మందపాటి వేర్లు కలిగిన ఎత్తైన మొక్కలు చెన్నైలో దొరుకుతాయి. మొక్కలు నాటిన మొదటి 20 ఏళ్లు ఎటువంటి లాభాలు లేవని తెలిపారు. తాను పెంచిన మొక్కలు కేరళ, గుజరాత్, దిల్లీ వంటి రాష్ట్రాలకు, దుబాయ్ వంటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయని పేర్కొన్నారు.”అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కపై బహుళ వర్ణ పువ్వులు వికసిస్తాయి. నేను ప్రస్తుతం ఎడారి గులాబీ మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ. 50- రూ. 60 లక్షల వరకు సంపాదిస్తున్నాను. వీటి పెంపకానికి ఎక్కువ నీరు అవసరం లేదు అని రైతు జలంధర్ చెప్పారు.

Related Posts
‘గ్రోమర్ రైతు సంబరాలు’.. రైతుల కష్టాన్ని గౌరవించిన కోరమాండల్ ఇంటర్నేషనల్
'Growmer Farmer Celebrations'.. Coromandel International

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మెగా లక్కీ డ్రా విజేతలకు ట్రాక్టర్లు మరియు మోటర్ సైకిళ్లను బహుకరించారు.. హైదరాబాద్ : భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత Read more

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ 2025
CEEW brings eco friendly cartoons to Hyderabad Literature Festival 2025

హైదరాబాద్ : కౌన్సిల్ ఆన్ ఎనర్జీ , ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) యొక్క ప్రతిష్టాత్మక కార్టూన్ సిరీస్ అయిన వాట్ ఆన్ ఎర్త్!® (WOE), హైదరాబాద్ Read more

అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్
అమ్మకాల్లో ఆపిల్ ఐఫోన్స్‌ సరికొత్త రికార్డ్

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్స్ రంగంలో ఆపిల్ ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్‌లోని భద్రతా ఫీచర్స్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే Read more

త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి.
త్రివేణి సంగ‌మంలో రాష్ట్ర‌ప‌తి.

త్రివేణి సంగ‌మం భారతదేశంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవలి కాలంలో భారత రాష్ట్రపతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *