ఇంటర్నెట్లో (On the Internet) ఓ వీడియో ఇప్పుడు రసవత్తర చర్చకు దారి తీసింది. రాత్రి వేళ వీధిలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని ఓ సింహం సమీపించడం, ఏమీ చేయకుండా వెళ్లిపోవడం సోషల్ మీడియాలో హీట్ అయ్యింది. ఈ దృశ్యాన్ని చూసినవారు షాకవుతున్నారు.వీడియోలో ఒక వ్యక్తి వీధిపై మడమలు మడతబెట్టుకొని పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడకు ఓ ఆడ సింహం (A lioness) వచ్చి అతడి సమీపానికి చేరింది. కాసేపు ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ వాసన చూసింది. కానీ అతనిలో ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరికి సింహం అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఇదంతా ఓ సీసీటీవీ వీడియోలా కనిపిస్తోంది.
వాస్తవమేనా? లేక ఏఐ కృత్రిమ మాయమా?
ఈ దృశ్యం నిజమైనదా? లేక ఏఐతో తయారైన వీడియోనా అనే అనుమానాలు తలెత్తాయి. “సింహం అంత దగ్గరకి వచ్చితే నిద్రలో ఉన్నవాడు తప్పకుండా మేలుకుంటాడు” అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే “సింహం ఎప్పుడూ గుంపుగా సంచరిస్తుంది, ఒంటరిగా కదలడం కష్టం” అని అంటున్నారు. దీంతో ఇది కచ్చితంగా రియల్ఫుటేజా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి.
ఘటన స్థలం గుజరాత్నా?
ఈ వీడియో భారత్లోనే తీసినదని చాలామంది నమ్ముతున్నారు. అందులో కనిపించిన పరిసరాలను బట్టి ఇది గుజరాత్ ప్రాంతమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గిర్ అడవుల్లో సింహాలు స్వేచ్ఛగా సంచరించేవి కావడం, అటువంటి సంఘటన అక్కడే జరగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.ఇలాంటి వైరల్ వీడియోల నేపథ్యంలో, ఏఐ ద్వారా తారుమారు చేయబడిన ఫుటేజీలు అసలైనవేనో కాదో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. నిజమైనదో కృత్రిమమో తెలుసుకునే మార్గాలు తక్కువ కావడంతో, వీటిపై అంతుశిక్కు పట్టలేకపోతున్నారు.
Read Also : Benagaluru Stampede : చిన్నస్వామి స్టేడియం దుర్ఘటన – కేఎస్సీఏ పై CID దర్యాప్తు