IPLలో సరికొత్త చరిత్ర

Read Time:  1 min
RR New Record
RR New Record
FONT SIZE
GET APP

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 210 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బలమైన బౌలింగ్ దళాన్ని ఎదుర్కొన్నప్పటికీ, రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ తమ ధాటిగా ఆడి విజయం సాధించారు. ఈ ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించిన ఘనతగా నిలిచింది.

Read Also : Kiara Advani : కవల పిల్లలకు జన్మనివ్వనున్న మెగా హీరోయిన్..?

రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్

ఇంతవరకు 200 పరుగులకుపైగా లక్ష్యాలను వేగంగా ఛేదించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉంది, వారు 16 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 17.3 ఓవర్లలో విజయాన్ని నమోదు చేసుకుని నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ గెలుపు విధానం అందరికీ ప్రేరణగా నిలిచింది.

రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చూపిన దూకుడు

ఈ విజయానికి ముఖ్యమైన కారణం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ చూపిన దూకుడు మరియు ఆత్మవిశ్వాసం. ఓపెనర్ల నుంచి మధ్యవరుస వరకూ అందరూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి, బౌలర్లపై పూర్తిగా ఆధిపత్యం చూపారు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే భారీ స్కోర్ నమోదు చేయడం, ప్రతి బంతిని ఆఫెన్సివ్‌గా ఆడడం విజయాన్ని మరింత సులభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు ఇతర జట్లకు కూడా స్ఫూర్తిగా మారుతోంది. తక్కువ ఓవర్లలో భారీ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం జట్టులో ఉన్న అద్భుతమైన సమష్టి శక్తిని చాటిచెప్పింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.