భారత క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన యంగ్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్ను చూపించాడు. ఫారం, ఫిట్నెస్ సమస్యల కారణంగా కొంతకాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నా, దేశవాళీ క్రికెట్లో మాత్రం షా వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో జరిగిన మ్యాచ్లో అతను డబుల్ సెంచరీ బాదారు.
Read Also: IND vs SA: టెస్ట్ సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ఇదే

ఛత్తీస్గఢ్పై మహారాష్ట్ర తరఫున ఆడుతున్న ఈ మ్యాచ్లో పృథ్వీ షా (Prithvi Shaw)144 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇది రంజీ హిస్టరీలో ఎలైట్ గ్రూప్లో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా నమోదైంది. అతని ఇన్నింగ్స్ మొత్తం దూకుడుతో సాగింది. 29 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 156 బంతుల్లో మొత్తం 222 పరుగులు చేశాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: