Jishnu Deva Varma: కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్న యువత – గవర్నర్ జిష్ణుదేవవర్మ

Read Time:  1 min
Jishnu Deva Varma: కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్న యువత - గవర్నర్ జిష్ణుదేవవర్మ
Jishnu Deva Varma: కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్న యువత - గవర్నర్ జిష్ణుదేవవర్మ
FONT SIZE
GET APP

వరంగల్ కేయూ: ‘నేటి దేశయువత పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్)కి సిద్ధంగా కొత్త పరిశోధన మైలురాళ్లను నిర్దేశిస్తున్నారని గవర్నర్, కాకతీయ విశ్వ విద్యాలయ ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Deva Varma) అన్నారు. విశ్వవిద్యాలయ 23వ స్నాతకోత్సవ సందర్భంగా వివిధ ఫ్యాకల్టీ పీహెచ్ అభ్యర్థులకు పట్టాలు, వివిధ సబ్జెక్టుల మొదటి ర్యాంక్ పొందిన వారికీ గోల్డ్ మెడల్సు ప్రదానం చేస్తూ విద్యా ర్థులు, పరిశోధకులు, ఉపాధ్యా యులు, ఆహ్వానితులు, ప్రముఖులను ఉద్దేశించి కాకతీయ విశ్వవిద్యాలయ (Kakatiya University) ఆడిటోరియంలో ప్రసంగించారు. ప్రయోగాశాలకే కాకుండా, జీవితంలో కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Jishnu Deva Varma
Jishnu Deva Varma

కేయూ ఉత్తర తెలంగాణలోనే గొప్ప విద్యాకేంద్రం

కాకతీయ విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణలోనే ఒక మహత్తర విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. న్యాక్ ఎ+ గ్రేడింగ్, 151 -200 లోనే మూడో గ్రీన్ మెట్రిక్, జాతీయ స్థాయిలో (national level) ఫార్మసీ కళాశాల 84వ ర్యాంకింగ్ ఇవన్ని విశేష విజయాలు అని, ఇవన్ని కేవలం వనరులవల్ల మాత్రమే సాధ్యం కాదు. ఉపాధ్యాయులు, పరిశోధ కులు, విద్యార్థుల విజన్, పట్టుదలవల్ల సాధ్యమైనవన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ అన్నట్టు విద్యఅంటే శరీరం, మనస్సు, ఆత్మ అన్నింటిలోనే అత్యుత్తమని వెలికి తీయడమే”, జాతీయ విద్యా విధానం 2020 దిశగా ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల మెరుగుదల దీనికి అనుగుణంగా కృత్రిమా మేధా, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూ రిటీ, డేటాసైన్సు, న్యూట్రిషన్ సైన్సు కోర్సులు కాకతీయ యూనివర్సిటీలో ప్రారంభిం చడం అభినందనియం అన్నారు. స్నాతకోత్సవం అంటే ఒక ముగింపుకాదని, ఒక కొత్త ప్రయాణ మని మాజీ రాష్ట్రపతి ఎ.పి.జే. అబుల్ కలాం అన్న మాటలు గుర్తుచేశారు. భారత ప్రధాని సూచించిన క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, క్యురియాసిటీ, కమ్యూ నికేషన్ లాంటి నైపుణ్యా లు 21వ శతాబ్దపు దిక్సూ చిలు అన్నారు. ప్రతీగొప్ప నాయకుడు ఒకప్పడు విద్యార్థి అన్నా రు. ధైర్యంగా ముందుకు సాగాలని, మార్పును ఆమోదించాలని, దయ, నైపుణ్యంతో సేవ చేయాలన్నారు.

ప్రతి విద్యార్థి జీవితం ఆనందభరితమైన క్షణం: డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి

ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ సంచాలకులు, శాంతి స్వరూప్ భట్నగర్: అవార్డుగ్రహీత డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ స్నాతకోత్సవం అ నేది ప్రతి విద్యార్ధి జీవితం ఆనందభరి తమైన క్షణం అన్నారు. మీ విజయానికి కారణ మైన తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులకు కృతఙ్ఞత ఉండాలన్నారు. గ్రామీణప్రాంతం, తెలుగు మా ధ్యమం అడ్డంకి కాదన్నారు. మన లక్ష్యం ము ఖ్య మని, కేవలం జ్ఞానముంటే సరిపో దని, దాన్నెలా ఉపయోగించుకోవాలో తెలియాలన్నారు .

జిష్ణు దేవ్ వర్మ తెలంగాణకు ఎప్పుడు గవర్నర్ అయ్యారు?

జిష్ణు దేవ్ వర్మ 2024 జూలై 31 నుండి తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు.

గవర్నర్ ఎన్నిక ఎలా జరుగుతుంది?

ఒక రాష్ట్ర గవర్నర్‌ను రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పదవీకాలానికి నియమిస్తారు మరియు తన ఇష్టానుసారం పదవిలో ఉంటారు. 35 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు మాత్రమే ఈ పదవికి నియామకానికి అర్హులు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Damodara Rajanarsimha: కొత్త టిమ్స్ హాస్పిటళ్లలో ఆధునిక సాంకేతిక పరికరాలు కొనాలి – మంత్రి దామోదర రాజనర్సింహ

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.