हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

గెలుపే వారి అలవాటు సచిన్ ప్రశంస.

Anusha
గెలుపే వారి అలవాటు సచిన్ ప్రశంస.

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. పటిష్ఠమైన ఇంగ్లండ్ జట్టుపై భారీ స్కోరు సాధించడమే కాకుండా, 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సంచలనం నమోదు చేసింది.ఒకానొక దశలో ఇంగ్లండ్ జట్టు విజయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, చివరి రెండు ఓవర్లలో ఆఫ్ఘన్ బౌలర్లు విజృంభించడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దాంతో, ఆఫ్ఘనిస్థాన్ టోర్నీలో నిలిచి సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

హైలైట్స్

పాకిస్థాన్‌ ఆతిథ్య‌మిస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో వ‌రుస‌గా సెంచ‌రీలు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క పాకిస్థాన్ జ‌ట్టు మిన‌హాయిస్తే మిగ‌తా ఏడు జ‌ట్ల త‌ర‌ఫున ప‌లువురు ఆట‌గాళ్లు శ‌త‌కాలు బాదారు. నిన్న‌టి ఇంగ్లండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ మ్యాచ్‌లో రెండు సెంచ‌రీలు వ‌చ్చాయి. మొద‌ట ఆఫ్ఘన్ ఆట‌గాడు ఇబ్ర‌హీం జ‌ద్రాన్ భారీ శ‌త‌కం (177) న‌మోదు చేయ‌గా.ఆ త‌ర్వాత ఛేద‌న‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ జో రూట్ కూడా సెంచ‌రీ (120) న‌మోదు చేశాడు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సీజ‌న్‌లో 11 సెంచ‌రీలు న‌మోద‌య్యాయి. ఇంకా నాకౌట్ ద‌శలో కొన్ని మ్యాచ్‌ల‌తో పాటు సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్ ఉండ‌డంతో ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.  టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో కొంత ఒత్తిడికి గురైనా, ఆ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన శతకంతో (177 పరుగులు) చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతనికి తోడు కెప్టెన్ హష్మతుల్లా (40), మహ్మద్ నబీ (40) కూడా మంచి సహకారం అందించారు.326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ జట్టు మైదానంలోకి దిగింది. జో రూట్ (120) శతకంతో రాణించగా, ఇతర బ్యాటర్లు సర్దుమణగలేకపోయారు. మ్యాచ్ చివరి దశలో ఆఫ్ఘన్ బౌలర్లు ఒత్తిడి పెంచడంతో ఇంగ్లండ్ జట్టు 317 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి రెండు ఓవర్లలో ఒమర్జాయ్ 5 వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆఫ్ఘనిస్థాన్ వైపు మలిచాడు.

సచిన్ టెండూల్కర్ ప్రశంసలు

ఈ అద్భుత విజయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఆఫ్ఘనిస్థాన్ జట్టును కొనియాడాడు. ‘‘ఇది ఆఫ్ఘన్ జట్టుకు తృటిలో దక్కిన విజయం కాదు, వారు గెలవడం అలవాటు చేసుకున్నారు. వారి ఆటతీరును చూసి గర్వపడాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే, సెంచరీ హీరో ఇబ్రహీం జద్రాన్, 5 వికెట్ల తీయడంతో మెరిసిన ఒమర్జాయ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు.

2023 ప్రపంచకప్‌లో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చేసింది. రేపు ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ అద్భుతం జరిగి ఆస్ట్రేలియాను ఓడిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది.ఇక రేపు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870