నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్

Read Time:  1 min
నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్
FONT SIZE
GET APP

ప్రస్తుతం సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, ఫోటోలు పెరిగిపోతున్నాయి. వాటిని సరైన దృష్టితో చూడకపోతే, చాలా మంది నకిలీ ఫోటోలపై నమ్మకం పెంచి తప్పు వార్తలను పంచుకుంటున్నారు. ఈ పరిస్థితి అసలు వార్తలను నిర్ధారించుకోవడం మరింత కష్టతరం చేస్తోంది.ఇలాంటి నకిలీ వార్తలు పట్ల జాగ్రత్త అవసరం.ఇటీవల, సీనియర్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ప్రకాశ్ రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తున్నట్లు చూపించార.

నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్
నకిలీ ప్రచారాలు ఎక్కువైతున్నాయి అంటూ.ప్రకాశ్ రాజ్

ఎవరో ఈ ఫోటోను షేర్ చేయడంతో అది త్వరగా పబ్లిక్ లోకి వచ్చినది.కొంతమంది ఈ ఫోటోను నిజమైనది అని నమ్మి, ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు చేశారు.ప్రకాశ్ రాజ్ ను నాస్తికుడిగా చెప్పుకునే విషయం తెలిసిందే.కాబట్టి, ఆయన కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం అనేది చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం అయింది. ఈ ఫోటో ప్రకాశ్ రాజ్ దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించారు.

ఈ ఫోటోను నకిలీ అని తెలిపారు, దీనిపై ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు.ప్రకాశ్ రాజ్ తన పోస్ట్‌లో ఈ రకమైన నకిలీ ప్రచారాలను చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.అయితే, ఈ విషయాన్ని పట్టించుకోకుండా నకిలీ ఫోటోలు, వార్తలు ప్రచారం చేసే వారు న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాలని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. ఆయన ఈ విషయంలో ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు.ఈ సంఘటన, సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని గమనించి, అలా సులభంగా నమ్మడం కష్టం అని మళ్ళీ గుర్తు చేస్తుంది.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.