7 more airports in addition to AP.. Rammohan Naidu

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఏపీ ప్రజల తరపున నిర్మలమ్మకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఏపీకి సముచిత న్యాయం చేసేలా టీమ్ వర్క్ చేస్తామన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని పేర్కొన్నారు. పౌరవిమానరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వుడాన్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, ఏపీలో అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు రాబోతున్నాయి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు.

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు. పన్ను చెల్లింపుల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. అలాగే, మధ్యతరగతి ప్రజలు రూ.12 లక్షలకు వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపింది.

Related Posts
ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు
ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు

ఏపీకి కేంద్రమంత్రి సహకరిస్తున్నారన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికలో Read more

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు
Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా Read more

కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి పై పవన్ రియాక్షన్
కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి

కెనడాలోని బ్రాంప్టన్‌ హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడి పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను Read more

భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు
Business traits are in the blood of Indians.. Chandrababu

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *