ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు … 13 మంది రోజువారీ కూలీలు భదోహ జిల్లాలో పని ముగించుకొని తిరిగి వారణిసి వైపు వెళుతుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్‌ రోడ్‌ లో ప్రమాదం జరిగింది.

ఓ ట్రక్కు అదుపుతప్పి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే బనారస్‌ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.