పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ విడుదలై నేటితో (డిసెంబర్ 22) ఏడాది పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ భారీ సెన్సేషన్గా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి బ్రహ్మరథం అందుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తన విభిన్నత, భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన కథనంతో యాక్షన్ జానర్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించింది. ప్రభాస్ మాస్ అప్పీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ అభినయం, మరియు శ్రుతీ హాసన్, జగపతి బాబు వంటి తారాగణం సినిమా విజయానికి పెద్ద ప్లస్ అయ్యాయి. దీంతో ‘సలార్’ కేవలం ఓ సినిమా కాకుండా, అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కల్ట్ మూవీగా ముద్ర వేసుకుంది. సినిమా థియేటర్లలో విజయం సాధించినప్పటికీ, సలార్ విజయానికి సాంకేతిక ప్రపంచంలోనూ పెద్ద గుర్తింపు లభించింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్లో 300 రోజుల పాటు ట్రాప్ ట్రెండింగ్లో నిలవడం ఒక గొప్ప రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా మాత్రమే కాదు,ఈ కథను అభిమానుల మదిలో మరింత ఇమిడిపోయేలా చేసింది.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్:పార్ట్ 1 – సీజ్ ఫైర్’రీ-రిలీజ్ అవగా, అది కూడా అభిమానుల నుండి అద్భుత స్పందనను అందుకుంది.ఈ రీ-రిలీజ్ సమయంలో కొత్త రికార్డులు కూడా నమోదు కావడం విశేషం.‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ ఒక ఆసక్తికర ముగింపుతో, ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిగా ఎదురు చూపిస్తోంది. ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’అనే టైటిల్తో సీక్వెల్ రానుండటాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. రెండో భాగం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరించారు. రెండో భాగంలో కథ మరింత ఉద్విగ్నంగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.