రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ, ముగ్గురు మృతి!

రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ, ముగ్గురు మృతి!

స్మార్ట్ ఫోన్లు వచ్చాక యువతలో చాలామంది తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ వచ్చాక చిన్నపిల్లల పై కూడా ఈ ప్రభావం అధికం అయినది. ఇక ప‌బ్‌జీ ఆట పిచ్చితో అనేకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా బిహార్‌లో ప‌బ్‌జీ ఆట పిచ్చి ముగ్గురు టీనేజర్ల ప్రాణాలు తీసింది. ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుప‌ట్టాల‌పై ప‌బ్‌జీ ఆడుతున్నారు. చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని ఉండ‌టంలో రైలు వ‌స్తున్న సంగ‌తిని వారు గుర్తించ‌లేదు. దాంతో వేగంగా వ‌చ్చిన ట్రైన్ వారిపైనుంచి వెళ్లిపోయింది. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటంతో ముగ్గురూ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ రైలు సెక్షన్‌లోని మాన్సా తోలాలోని రాయల్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisements
 రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ, ముగ్గురు మృతి!

పిల్లల గేమింగ్ అలవాట్లపై జాగ్రత్తలు

సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీఓ) వివేక్ దీప్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్ర‌మాదం జ‌రిగిన తీరును పరిశీలించారు. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల గేమింగ్ అలవాట్లను పేరెంట్స్‌ పర్యవేక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను జ‌ర‌గ‌కుండా బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాల‌ని అధికారులు తల్లిదండ్రులను కోరారు.
మృతులను రైలు పట్టాలపై పబ్‌జీ ఆడుతుండగా గుమ్టి నివాసి ఫుర్కాన్ ఆలం, మన్షా తోలాకు చెందిన‌ సమీర్ ఆలం, బారి తోలా నివాసి హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. ఇటీవల పలువురు యువకులు ఈ విధంగా సేఫ్‌ కాని ప్రదేశాల్లో పరధ్యానంగా ప్రవర్తించడం వల్ల వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండటానికి బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, అధికారులు పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. మృతుల కుటుంబీకులు వారి పిల్లల మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామాలకు తరలించారు. రైలు పట్టాలపై పబ్‌జీ ఆడటం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Related Posts
ఏయే దేశాలపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఉంటుంది?
విదేశీ విద్యార్ధుల ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు!

కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ప్రారంభించనున్నట్టు ఇటీవల అమెరికా ప్రకటించింది. అక్రమ వలసలను ఆపుతామని, చట్టవిరుద్ధంగా తయారు చేసిన ఫెంటానిల్ అమెరికాలోకి రావడాన్ని నిరోధిస్తామని ఆ దేశం Read more

కేంద్ర మంత్రికి స్టాలిన్ వార్నింగ్
తమిళ విద్యా విధానంపై కేంద్రం vs తమిళనాడు మాటల యుద్ధం

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడు విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలు, Read more

వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం
వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం

ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధతను దేశవ్యాప్తంగా నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో Read more

సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్‌
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మహిళ అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే ఆయన నివాసంలో కత్తితో దాడి చేసిన కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై Read more

×