sharmila ramurthi

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల వైఎస్ షర్మిల సంతాపం

రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం తెలియజేసారు. రామ్మూర్తి నాయుడు హఠాన్మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. రామ్మూర్తి నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా నని, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ షర్మిల తెలియజేసారు.

రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణ వార్త తెలిసి..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు..అక్కడి నుండి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు.

అలాగే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన తమ్ముడి భౌతికకాయం చూసి చంద్రబాబు బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Posts
బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్..?
mahesh rajamouli movie

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ప్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని Read more

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా
Lok Sabha adjourned indefinitely

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఈరోజు నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో Read more

కోకాకోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
CM Revanth Reddy inaugurated the Coca Cola factory

•ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణా ప్రభుత్వ సమాచార ఐటి , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల Read more

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త
AP Sarkar good news for une

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ట్రెయిన్ అండ్ హైర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *