chandrababu

భూముల ధరలపై పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయం వాయిదా

విజయవాడ : రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో అనేకసార్లు భూముల మార్కెట్ ధరలను పెంచారు. దీని వల్ల ప్రజలు, సామాన్యులపై ఎనలేని భారం పడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్కెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజలు ఇతిబాధలు పట్టించుకోకుండా ఆదాయం పెంపే లక్ష్యంగా ఏకంగా ఏటా 14వేల కోట్ల రెవెన్యూ చూపించేలా ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఆర్థికశాఖ గంపెదాశలు పెట్టుకుంది. ఇది అమలైతే ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారానే ఏలా 14వేల కోట్ల ఆదాయం వస్తుందని, కాబట్టి భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు అనుమతించాలని ఆర్థికశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది. దీనిపై ప్రజుల్లో కొంత ఆందోళన, అంబడి గెలకొన్నాయి. భూముల ధరలు పెంచారని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ అంశం పై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని, జనవరి నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదావేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30న మంగళగిరిలోని సీసీఎల్ ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం జరగమంది. అచెరోజు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి అనగాని ఆంధ్రజ్యోతికి చెప్పారు. “మాది ప్రజా ప్రభుత్వం. వారికి కష్టం కలిగేలా ఏకవర్ల నిర్ణయాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకు ముందే ప్రజలకు సామీ ఇచ్చారు. కాబట్టి రూముల మార్కెట్ ధరలు పెంచాలన్న అంశంపై మరోసారి అధికారులతో చర్చించాలనుకున్నాం. రెవెన్యూ సదస్సులో రెండో సెషన్ తర్వాత రజిస్ట్రేషన్ ఐజీలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిపై వారిచ్చే నివేదికలపై చర్చిస్తాం. ఆ త ర్వాత సీఎంకు ని వేదిస్తాం అని అనగాని స్పష్టం చేశారు. ఇప్పటికే నిమా విభాగం కూడా ఈ అంశంపై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. “రాష్ట్రంలో ఒకవైపు రెవెన్యూ సరస్సులు గ్రామగ్రామాన జరుగుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు భారీగా తరలివచ్చి సరస్సుల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో భూముల మారె ధరలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని నిఘా విభాగం ప్రభుత్వానికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది

Related Posts
కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ ధరించిన టై
కోట్లు పలికిన స్టీవ్ జాబ్స్ ధరించిన టై

టెక్ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్ అండ్ స్టీవ్ జాబ్స్ వ్యక్తిగత వస్తువులు తాజాగా అమ్మకానికి రావడం కలకలం సృష్టిస్తోంది. వీరి ఉపయోగించిన బట్టలు, ఉత్తరాలు అన్నీ లక్షలకు Read more

పిఎల్‌ఐ పథకం కింద మెరిల్ వారి అధునాతన తయారీ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రధాని
Merrill was the pm modi who launched their advanced manufacturing facility under the PLI scheme

గుజరాత్ : భారతదేశంలో అగ్రగామి గ్లోబల్ మెడ్‌టెక్ కంపెనీల్లో ఒకటైన మెరిల్ తమ అత్యాధునిక ఉత్పత్తి ప్రాంగణాలను గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉత్పత్తి Read more

ఏఐ సాంకేతికకు తెలంగాణ మద్దతు
Telangana support for AI technologies

హైదరాబాద్ : స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయని, సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సొల్యూషన్స్‌కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, Read more

జొమాటో పేరు ఎటర్నల్ లిమిటెడ్‌గా మారింది!
photo 1653389527532 884074ac1c65

డిసెంబర్ 23న బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో జొమాటో ప్రవేశించిన కొన్ని వారాల తర్వాత, 17వ వార్షికోత్సవంలో పేరును మార్చింది. జొమాటో బోర్డు కంపెనీ పేరును "ఎటర్నల్ లిమిటెడ్"గా మార్చేందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *