winter

పెరిగిన చలి మైనస్ లో ఉష్ణోగ్రత

డిసెంబర్ మాసం అంటేనే చలి వణికిస్తుంది. అయితే ఇటీవల అల్పపీడన ప్రభావంతో చలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగింది. దీనికి కారణం హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. చంటి పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. రాజస్థాన్‌లోని చురు- 3.1, పంజాబ్ అమృత్‌సర్- 3.8, రాజస్థాన్ పిలానీ- 4.0, ఉత్తరప్రదేశ్ సర్సవా- 4.1, పంజాబ్ హల్వారా ఐఎఎఫ్- 4.1, రాజస్థాన్ ఉత్తర్‌లై ఐఎఎఫ్- 4.2, హర్యానా భివానీ- 4.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్- 4.6, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్- 4.7, మధ్యప్రదేశ్ ఉమేరియా- 4.8, ఉత్తరప్రదేశ్ బరేలీ- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts
Elon Musk : ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం
ఎలోన్ మస్క్ పై పెరుగుతున్న వ్యతిరేకత..టెస్లా కార్లు పై ప్రభావం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పెస్ ఎక్స్ అండ్ టెస్లా అధినేత ఎలోన్ మస్క్, డోనాల్డ్ ట్రంప్ టీంలో భాగమైనప్పటి నుండి అతని పై విద్వేషం పెరుగుతోంది. దీనికి Read more

జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
జేడీయూ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శారీరకంగా అలసిపోయారని, మానసికంగా రిటైరయ్యారని Read more

మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలో తెలుసా..?
RBI Bank Rpao

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 25 బేసిస్ పాయింట్లు (bps) వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించాల్సిన Read more

వారిపై పరువునష్టం దావా వేస్తా: బీజేపీ నేత పర్వేష్ వర్మ
parvesh

మరికొన్ని రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండగా.. అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీ స్థానంలో Read more