తమిళ హీరో దళపతి విజయ్ వరుస విజయాలతో తమిళనాడులో మాత్రమే కాకుండా,తెలుగులోనూ తన మార్కెట్ను విస్తరిస్తూ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ సినిమాలు,రాజకీయాలు రెండింటినీ ఒకేసారి మెనేజ్ చేస్తూ తన అభిమానుల అంచనాలను తాకుతున్నారు.అయితే,రాజకీయ రంగ ప్రవేశంతో విజయ్ త్వరలో సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారని అంచనాలు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో విజయ్ తన కెరీర్లో చివరిగా చేస్తున్న సినిమాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. సెప్టెంబర్ 5న విడుదలైన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) విజయ్ కెరీర్లో మరో హిట్గా నిలిచింది.ఈ సినిమాలో విజయ్ తండ్రీ-కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించారు.తమిళంలో ఇది ప్రసిద్ధ AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించిన 25వ చిత్రం.
సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, విజయ్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాలో విజయ్ పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా మెచ్చుకోదగినది.స్నేహ,మీనాక్షి చౌదరి, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, వైభవ్,మరియు మోహన్ వంటి తారాగణం విజయ్తో కలిసి నటించారు.‘గోట్’భారీ వసూళ్లతో విజయ్ అభిమానులకు పండగను అందించింది.విజయ్ తాజా చిత్రం ‘విజయ్ 69’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్తో పాటు పూజా హెగ్డే, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, బాబీ డియోల్, మమితా బైజు, మరియు నరేన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో, అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది విజయ్ నటనపై దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, “విజయ్ ఒక గొప్ప నటుడు. కానీ, తమిళ సినీ పరిశ్రమ ఆయనను పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. కమర్షియల్ ఫ్రేమ్లో పెట్టి ఆయన ప్రతిభను అణచివేసినట్లు అనిపిస్తోంది,” అని అన్నారు. ఈ కామెంట్లు అభిమానుల్లో హాట్ టాపిక్గా మారాయి.