నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3 షూటింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఉత్తర భారతదేశంలో పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం ఇటీవల జమ్మూ కశ్మీర్కు వెళ్లింది.అక్కడ శ్రీనగర్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ చిత్రం బృందంలో ఒకరు, యువ సినిమాటోగ్రాఫర్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కృష్ణను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.ఛాతీకి ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. హిట్ 3 చిత్రం ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళం దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (డీఓపి)గా పని చేస్తున్నారు, కృష్ణ ఆయన అసోసియేట్గా పనిచేశారు.

రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్లో షూటింగ్ తరువాత జమ్మూ కశ్మీర్లో చిత్రబృందం షెడ్యూల్ చేయడానికి వెళ్లింది.అక్కడ shooting చేస్తున్న సమయంలో కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను జ్వరం కారణంగా 23న శ్రీనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ, తన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా అవకాశం పొందారు. అయితే, ఆసుపత్రిలో ఆమె క్రమంగా కోలుకున్నప్పటికీ, గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందింది. కృష్ణ ఎర్నాకులంకకు చెందిన కృష్ణ కోదంబ్రం రాజన్, గిరిజ దంపతుల కుమార్తె. ఆమె తండ్రి పెరుంబవూరు, కురుపంపాడిలో గిన్నిస్ స్టూడియోలు నిర్వహిస్తారు. అలాగే, ఆమె వుమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సభ్యురాలిగా కూడా పనిచేశారు. కృష్ణ మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. హిట్ 3 బృందం, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ త్రాగిచ్చిన శోకాన్ని సహించలేకపోతున్నారు.