ap cabinet

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

ఏపీ కేబినెట్‌పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు, హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌కు అనుమతి నిస్తూ నిర్ణయం తీసుకుంది.
వరద ప్రభావిత బాధితులకు రుణాలు
వర్షకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్‌పై, రైతులకు రుణాల రీషెడ్యూల్‌ కోసం స్టాంప్‌ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం,ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది.
ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్‌ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది . మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది.

Related Posts
కాకినాడలో పెద్దపులి సంచారం
tiger

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పెద్దపులి భయం కొనసాగుతుంది. పెద్ద పులి ఆ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ పర్యాటానికి సైతం దాదాపుగా 10 రోజులుగా బ్రేక్ పడింది. Read more

వైసీపీకి బిగ్ షాక్!
వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీని Read more

Pemmasani: బీసీలకు జాతీయ గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ: పెమ్మసాని
Pemmasani: బీసీలకు జాతీయ గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ

ఈ రోజు గుంటూరులో వైసీపీని వీడి, వడ్డెర సామాజిక వర్గం నుండి నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని Read more

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..!
Timing of Godavari Pushkara is finalized

హైదరాబాద్‌: కోట్లాది మంది భక్తుల ఆదరణ పొందుతున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించబడింది. దేశం మరియు విదేశాల నుంచి భక్తులు గోదావరి పుష్కరాలకు తరలిరానున్నారు, దీనితో ప్రభుత్వం Read more