pawan

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్

ఇటీవల కాలంలో నాగబాబుకు మంత్రి పదవిపై తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌‌లో మాట్లాడుతూ… ‘‘మనతో ప్రయాణం చేసి, పని చేసిన వారిని నేను గుర్తించాలి నాగబాబు నాతో పాటు సమానంగా పని చేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కొసం నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధు ప్రీతి కాదు.. పనిమంతుడా కాదా అనేదే ముఖ్యం. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం. మనోహర్, హరిప్రసాద్‌లు మొదటి నుంచి పార్టీ కోసం పని చేశారు.

Pawan Kalyan

రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం

ఇదే విషయంలో జగన్‌ను మీరెందుకు అడగలేదు. కేవలం పవన్ కళ్యాణ్‌ను మాత్రమే అడుగుతారు. మాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తరువాతతరం పిల్లలకు ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక అవుతారు. మంత్రి అనేది తరువాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నాం.

అతని పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం’’ అనిచెప్పుకొచ్చారు. ముందు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాకనే మంత్రి పదవి గురించి ఆలోచిస్తానని అన్నారు. ఎక్కడో ప్రత్యేక పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్సీ కాకముందు మంత్రి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ ఇప్పుడు అంత ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవన్నారు.

Related Posts
ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల
ys sharmila asked cm chandrababu to pay the pending dues of aarogyasri

అమరావతి: పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ అని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస Read more

వైసీపీకి బిగ్ షాక్!
వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేతలు, కార్యకర్తలు పార్టీని Read more

భద్రత పెంచాలని దస్తగిరి ఎస్పీకి వినతి
భద్రత పెంచాలని దస్తగిరి ఎస్పీకి వినతి

సాక్షి దస్తగిరి భద్రత కోసం ఎస్పీని కలిసి వినతిపత్రం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైన సాక్షి దస్తగిరి, నేడు కడప జిల్లా ఎస్పీ Read more

వివేకా హత్య కేసు సాక్షి మృతదేహానికి మళ్ళీ పోస్టుమార్టం
వివేకా హత్య కేసు: కీలక సాక్షి మృతి.. మళ్ళీ పోస్టుమార్టం!

కడప జిల్లా రాజకీయాల్లో కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న అనారోగ్యంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *