votar card

ఓటర్ కార్డు ఓటుకు గ్యారంటీ కాదు: ఈసీ

ఇటీవల జరిగిన ఎన్నికలపై పలు అనుమానాలకు తావు వున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓటర్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటేసే హక్కు ఉన్నట్లు కాదని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి 1 తో పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisements

యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.


సవరించిన ఓటర్ల జాబితా
ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డులు కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.

Related Posts
రేపు మోదీ సభలో మహిళా పోలీసులతోనే భద్రతా ఏర్పాట్లు
రేపు మోదీ సభలో మహిళా పోలీసులతోనే భద్రతా ఏర్పాట్లు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందితో Read more

పాకిస్తాన్ గగనతలం మీదుగా మోదీ విమాన ప్రయాణం
పాకిస్తాన్ గగనతలం మీదుగా మోదీ విమాన ప్రయాణం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ గగనతలం గుండా వెళుతున్నప్పుడు, భద్రతకు ఎవరు బాధ్యత వహించారు? దీనికి సంబంధించి అన్ని దేశాలకు ఒక ప్రోటోకాల్ ఉంది. దీని ప్రకారం, Read more

పన్ను తగ్గింపులు కోరవద్దు: నితిన్‌ గడ్కరీ
పన్ను తగ్గింపులు కోరవద్దు: నితిన్‌ గడ్కరీ

పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. Read more

పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన భద్రతా దళం
పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన భద్రతా దళం

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికులు ఒక పాకిస్థాన్ చొరబాటుదారుడిని కాల్చి చంపారు. ఈ ఘటన భారత్-పాక్ సరిహద్దులో భద్రతా Read more

×