Y C P

YCP MLC: తిరుమల బ్రేక్​ దర్శనానికి రూ. 65 వేలు వసూలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు

వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖాన్‌పై తిరుమల పోలీసుల వారు ఒక కేసు నమోదు చేశారు శ్రీవారి దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదుల జకియా ఖాన్ వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని చెప్పి ఆరుగురి నుంచి రూ. 65 వేలు తీసుకున్నారన్న ఆరోపణ ఉంది అంతేకాకుండా టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసినప్పుడు జకియా తన చేతిలో సిఫార్సు లేఖను చూపించారని పేర్కొన్నారు భక్తుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రశేఖర్ ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖాన్ ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజి పేర్లను చేర్చారు ఈ కేసుపై తూర్పు దర్యాప్తు చేసి ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటనపై వైసీపీకి సంబంధం లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు ఆయన మాట్లాడుతూ జకియా ఖాన్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించారు ఈ వివరణతో పార్టీకి నష్టం తగలకుండా జకియా ఖాన్ వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఈ ఘటనకి బాధ్యత వహించవచ్చని స్పష్టం చేశారు.

Related Posts
తిరుపతి ఘటనతో అప్రమత్తమైన శబరిమల..
తిరుపతి ఘటనతో అప్రమత్తమైన శబరిమల

తిరుపతి తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల అధికారులు అప్రమత్తమవడానికి కారణమైంది.కేరళలోని శబరిమల ఆలయ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.గతంలో జరిగిన విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని వారు Read more

ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
Tirumala VIP

తిరుమలలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున Read more

శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె
Saree for Goddess Padmavati

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి Read more

కుంభమేళాలో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు: ప్రభుత్వం ప్రకటన
55 Crore People Bath in Kum

మానవ చరిత్రలో అతిపెద్ద కార్యక్రమమన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా మహాకుంభమేళాకు పేరుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *