ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ భారతదేశంలో తన కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా టెస్లా బ్రాండ్కు భారీ ఆదరణ ఉన్న నేపథ్యంలో, భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించారు. ఇందుకోసం టెస్లా కంపెనీ భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ తో కలిసి ఫాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో, భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తమ దేశాన్ని (అమెరికాను) లాభపడటానికి వేదికగా మార్చుకుంటున్నాయని, సుంకాలతో తమ నుంచి లబ్ధి పొందాలని భావిస్తున్నారని చెప్పారు.ట్రంప్ అభిప్రాయప్రకారం, ఎలాన్ మస్క్ భారత్లో ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం తనకు వ్యక్తిగతంగా అనుకూలంగా ఉండొచ్చు. అయితే, అమెరికా దృష్టికోణంలో చూస్తే ఇది అన్యాయమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలు అమెరికాకు ఎగుమతులు పెంచుకోవడానికి సుంకాలను తగ్గించాలని చూస్తుంటే, అమెరికా కంపెనీలు విదేశాల్లో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల అమెరికా ఉపాధికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంటర్వ్యూలో మస్క్ పక్కన ఉన్నప్పటికీ, ట్రంప్ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. అయితే, ఈ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా స్పందించలేదు. కానీ, భారత్లో తన వ్యాపార వ్యాప్తికి సంబంధించిన ప్రణాళికలను కొనసాగిస్తూనే ఉన్నారు.
అమెరికా పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్తో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీ అనంతరం, మస్క్ భారత్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి, ఎలాన్ మస్క్ భారత్లో ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం గ్లోబల్ వ్యాపార పరంగా అతనికి కీలకమైన నిర్ణయం. అయితే, దీనిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడం, మస్క్ఉండగానే ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో ఈ అంశం మస్క్, ట్రంప్ మధ్య సంబంధాలపై ఏవిధమైన ప్రభావం చూపుతుందో. ఇంతకుముందు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సుంకాల విషయంలో చర్చించినట్లు ట్రంప్ వెల్లడించారు. విద్యుత్ కార్లపై భారత ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలను తాను మోదీ ముందు ప్రస్తావించానని తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు, వాణిజ్య ఒప్పందాల కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని ట్రంప్ వెల్లడించారు. మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆయనను కలుసుకున్న విషయం తెలిసిందే.ఆ భేటీ తర్వాత కొద్ది రోజుల్లోనే టెస్లా భారత్లో నియామక ప్రక్రియ ప్రారంభించింది.ఈ ఏడాది ఏప్రిల్ నెలనాటికి టెస్లా విక్రయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల, భారత ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని ప్రకటించింది.ఈ విధానం ప్రకారం కార్ల తయారీ సంస్థలు కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి దేశంలో ఫ్యాక్టరీని స్థాపిస్తే, దిగుమతి సుంకాలను 15%కి తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.