Tribal child insulted by royal family.. PM Modi

గిరిజన బిడ్డను రాజకుటుంబం అవమానించింది: ప్రధాని

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ‘గిరిజన ఆడబిడ్డ’ను ‘రాజకుటుంబం’ అవమానించిందని తప్పుపట్టారు. ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.

image

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ద్రౌపది ముర్ము శుక్రవారం చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ పార్లమెంటు వెలుపల స్పందించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వివాదం రేపాయి. ప్రసంగం చివర్‌లో రాష్ట్రపతి బాగా అలసిపోయారు. మాట్లాడలేకయారు అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము మాతృబాష హిందీ కాదు, ఒడియా. ఈరోజు పార్లమెంటులో ఎంతో ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. కానీ రాజకుటుంబం మాత్రం ఆమెను అమానించడం మొదలుపెట్టారు. ఆమె ప్రసంగం బోర్ కొట్టిందని ఒకరు అంటే, ‘పూర్ థింగ్’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఇది పదికోట్ల మంది గిరిజనులకు అవమానించడమే. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇది అవమానమే. వీళ్లు విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తుంటారు, అర్బన్ నక్సల్ గురించి మాట్లాడుతుంటారు. అహంకారంతో నిండిన ఆ రెండు పార్టీలు (ఆప్, కాంగ్రెస్) చేతులు కలపడం పట్ల ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మోడీ హెచ్చరించారు.

ద్రౌపది ముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేయగా, రాష్ట్రపతి భవన్ సైతం కాంగ్రెస్ ప్రముఖ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని కించపరచేలా ఉన్నాయని, రాష్ట్రపతి ఎలాంటి అసలట లేకుండా ప్రసంగం చేశారని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌కు హితవు పలికింది.

Related Posts
సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం
telangana talli

హైదరాబాద్‌లోని సచివాలయంలో 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇది సచివాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించేలా, ఎత్తైన పీఠం Read more

హైదరాబాదీ టాలెంట్‌కు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా
sudhakar cars

ఆనంద్ మహీంద్రా హైదరాబాదీ టాలెంట్ గురించి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సుధాకర్ అనే వ్యక్తి వివిధ ఆకారాలలో కార్లను తయారు చేయడం మరియు ఒక మ్యూజియం Read more

ఉత్కర్ష్ ఒడిషా-మేక్ ఇన్ ఒడిషా కాన్‌క్లేవ్ లో పాల్గొననున్న మోదీ
narendra modi

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కర్ష్ ఒడిషా-మేక్ ఇన్ ఒడిషా కాన్‌క్లేవ్ 2025ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ Read more

అంగన్ వాడీ లకు చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం
telangana anganwadi

తెలంగాణ రాష్ట్రం అంగన్ వాడీ (Anganwadis) టీచర్లకు, హెల్పర్లకు గిప్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నందున, ప్రతి టీచర్‌కు మరియు హెల్పర్‌కు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

/