Pakistan:పాకిస్థాన్ లో కాన్వాయ్ రెండో దాడి పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) మార్గంలో పాక్ ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒకే ఒక్క ఘటన కాదు. గడిచిన 24 గంటల్లోనే పాకిస్థాన్ బలగాలపై జరిగిన ఇది రెండో దాడి కావడం గమనార్హం. హర్నై ప్రాంతంలో బాంబ్ డీఫ్యూజ్ స్క్వాడ్ రైల్వే ట్రాక్ను పరిశీలిస్తున్న సమయంలో మరో పేలుడు చోటుచేసుకుంది.ఈ వారం ప్రారంభంలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చారిత్రక స్థాయిలో ఓ పెద్ద దాడిని నిర్వహించింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న రైలును హైజాక్ చేసి దాదాపు 200 మందికి పైగా పాకిస్థాన్ సైనికులను, ఐఎస్ఐ (ISI) అధికారులను బందీలుగా తీసుకుంది. బీఎల్ఏ వారు తమ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వానికి గడువు విధించింది.

కానీ పాక్ ప్రభుత్వం స్పందించకపోవడంతో 214 మంది బందీలను చంపేశామని బీఎల్ఏ అధికారికంగా ప్రకటించింది.గత కొంతకాలంగా బలూచ్ స్వతంత్ర పోరాటం మళ్లీ ముదిరిపోతుంది. బలూచిస్థాన్లో పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను అణచివేయడంలో విఫలమవుతోంది.ఇప్పటికే CPEC ప్రాజెక్ట్ కారణంగా అక్కడి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తీవ్రవాద దాడులు పెరుగుతున్న హింసాత్మక సంఘటనలు పాక్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ తాజా పరిణామాలు పాక్ సైన్యం, ప్రభుత్వ పరిపాలనలో తీవ్రమైన లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. మరోవైపు బలూచ్ తిరుగుబాటుదారుల దాడులు పెరిగే అవకాశముందన్న విశ్లేషణలు వస్తున్నాయి.ఈ హింసాత్మక ఘటనలతో పాక్ భద్రతా వ్యవస్థ ఎంతగా క్షీణించిందో స్పష్టమవుతోంది. చైనా పెట్టుబడులు అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పాకిస్థాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పరిస్థితులు ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే బలూచిస్థాన్ ప్రాంతం మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.