one nation one poll to be introduced in lok sabha on december 16

లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024ను కూడామేఘ్​వాల్ ప్రవేశపెట్టనున్నారు.

Advertisements

లోక్​సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలను అసెంబ్లీలతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు సహా రెండు ముసాయిదా చట్టాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో జమిలి ఎన్నికల అమలులో ఓ కీలక ముందడుగు పడినట్లు అయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లోక్​సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికలపై మాత్రమే కేంద్రం దృష్టి సారించింది. స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధిచి ప్రస్తుతానికి దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించింది.

కాగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్​ సింగ్​ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. “ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోయినా లేదా మెజారిటీ కోల్పోతే- ఆ రాష్ట్రం, ప్రభుత్వం లేకుండా మిగతా నాలుగున్నర సంవత్సరాలు ఉంటుందా? అది ఈ దేశంలో సాధ్యం కాదు. ఇప్పటివరకు ప్రభుత్వాలు తమ ఐదేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి. కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు రెండున్నరేళ్లకు, కొన్ని చోట్ల మూడేళ్లకు కూలిపోతాయి. 6 నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు.” అని సింగ్ అన్నారు. జమిలి ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ- జేపీసీకి పంపించాలని మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Related Posts
Pawan Kalyan son: మార్క్ శంకర్‌కి కొనసాగుతున్న చికిత్స ..ఆస్పత్రికి చేరుకున్న పవన్
Pawan Kalyan son: మార్క్ శంకర్‌కి కొనసాగుతున్న చికిత్స ..ఆస్పత్రికి చేరుకున్న పవన్

సింగపూర్‌లో అగ్నిప్రమాదం – పవన్ కుమారుడికి గాయాలు సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Read more

Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు
Pakistan : పాక్ ఉగ్ర వ్యూహానికి రూ.10 వేల కోట్లు ఖర్చు

పాకిస్తాన్ ఉగ్రవాదానికి గట్టి ఆధారంగా మారిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం బైసరీన్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన Read more

ఆప్ అగ్రనేతలకు చావు దెబ్బ!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నా యి. బీజేపీ అధికారం ఖాయమైంది. ఆప్ ప్రముఖులు ఓటమి బాట పట్టారు. కేజ్రీవాల్ తో సహా డిప్యూటీ Read more

మహారాష్ట్ర నుంచి కవాల్ టైగర్ రిజర్వులోకి వచ్చిన పులి..
tiger

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లో ఒక పులి గమనించబడింది. ఈ పులి మాహారాష్ట్ర నుండి తెలంగాణలోకి చేరుకుంది. నవంబర్ 17, ఆదివారం ఈ సంఘటన Read more

Advertisements
×