New law in AP soon: CM Chandrababu

త్వరలో ఏపీలో కొత్త చట్టం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హతలను మార్చుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా కొత్త చట్టం తీసుకువస్తామని తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిమాణం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఒకప్పుడు భారం అని.. కానీ ఇప్పుడు అది ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలు ఉన్నాయని.. అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Advertisements
image
image

రాష్ట్రంలో జనాభా పెంచేందుకు.. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతకు సంబంధించిన చట్టం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంతకుముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే గరిష్ఠంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని.. అంతకంటే ఎక్కువ ఉన్నా.. 25 కిలోలకు మించి ఇచ్చేవాళ్లం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు.

అయితే అదంతా అప్పటి పరిస్థితి అని.. కానీ ఇప్పుడు జనాభా పెంచాలని. అందుకే ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జనా భా 2026లో 5.38 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు.. 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని.. ఆ తర్వాత 2036లో 5.44 కోట్లకు చేరుతుందని చెప్పారు. అయితే 2041లో మాత్రం ఏపీ జనాభా 5.42 కోట్లకు తగ్గిపోయి.. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని చంద్రబాబు తెలిపారు.

Related Posts
ఇజ్రాయెల్-ఇరాన్ సంబంధాల పరిష్కారంలో భారతదేశం యొక్క కీలక పాత్ర
US INDIA JAISHANKAR

ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సంబంధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ఈ నేపధ్యంలో, భారతదేశం ఈ అంశంపై తన దౌత్య ప్రయత్నాలను మరింత పెంచుతోంది. Read more

పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!
పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి!

పాకిస్థాన్‌పై 15 వేల తాలిబాన్ యోధుల దాడి! ఏందుకు? పాకిస్తాన్ దశాబ్దాలుగా, వ్యూహాత్మక కారణాలతో తాలిబాన్‌లను పెంచి పోషించింది. చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి, సైనిక సహాయాన్ని అందించింది. Read more

కేదార్నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Kedarnath ropeway

చార్ధామ్ యాత్రలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేదార్నాథ్ ధామానికి ప్రయాణం మరింత సులభతరం కానుంది. తపోవన సమానమైన ఈ యాత్రను తేలిక చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక Read more

Satellite : కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!
Satellite

భూ కక్ష్యలో మానవ నిర్మిత ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్న తీరుతో పాటు, వాటి చుట్టూ తిరుగుతున్న శకలాల ముప్పు కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్ Read more

×