MP Arvind invites CM Revanth Reddy to join BJP!

సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన ఎంపీ అర్వింద్ !

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్‌గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి.. ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Advertisements
సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదు

ఇదిలా ఉండగా.. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చింది ప్రధాని మోడీ కానీ ఎయిర్ పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి దక్షిణభాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. దీన్ని ఆపింది ఎవరు?, తన కంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ

పని-జీవిత సమతుల్యత గురించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆలోచన "ఆసక్తికరమైనది" అని ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా అన్నారు. "పని-జీవిత సమతుల్యతపై గౌతమ్ Read more

శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌
Telangana Governor Jishnu Dev Varma visited Bhadradri Ramaiah

భద్రాచలం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, ఆలయానికి సమీపంలోని ఆంజనేయస్వామి Read more

Riyan Parag: రియాన్ ప‌రాగ్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా..ఎందుకంటే?
Riyan Parag: రియాన్ ప‌రాగ్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా.. ఎందుకంటే?

రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు, స్టాండ్‌-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు ఐపీఎల్‌లో జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు Read more

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప -2 ట్రైలర్
pushpa 2 trailer views

పుష్ప 2 ట్రైలర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ – Read more

×