Massive encounter in Chhattisgarh. 10 Maoists killed

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌‌: ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవాళ(శుక్రవారం) మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మృతిచెందరాని..మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఎదురు ఎదురు కాల్పులు జరిగడంతో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కిరణ్‌ చవాన్‌ తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.

కాగా, నిన్న ఒరిస్సా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. భద్రతా బలగాలను చూసి నక్సల్స్‌ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే..ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్, బీహార్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైందని.. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు, నాలుగు జిల్లాల్లో ఈ సమస్య కొనసాగుతోందని అన్నారు. దాన్ని అణచివేసేందుకు కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

Related Posts
యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ మెసేజ్
yogi

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 రోజుల్లోగా యోగి రాజీనామా Read more

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసేన అధినేత

నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందన్న వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ కూటమిలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ వివాదం టీడీపీ, జనసేన నాయకుల మధ్య పదునైన Read more

బాత్రూమ్‌లో కెమెరా: 2 అరెస్టులు, 7 పై కేసు
బాత్రూమ్‌లో కెమెరా: 2 అరెస్టులు, 7 పై కేసు

హైదరాబాద్ సమీపంలో ఉన్న మేడ్చల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కొంతమంది మహిళా విద్యార్థులు వంట సిబ్బంది హాస్టల్ వాష్రూమ్‌లలో వీడియోలు రికార్డు చేసినట్లు ఆరోపణలు చేసిన అనంతరం, Read more

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది: బండి సంజయ్‌
మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈరోజు యూఎస్‌కు చెందిన 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' ఎన్‌ఆర్‌ఐ నేతలతో ఆయన వీడియో కాన్ప్‌రేన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *