రైలు హైజాక్ ఎలా జరిగింది అంటే: ట్రైన్ డ్రైవర్ వివరణ

Train Hijack: రైలు హైజాక్ ఎలా జరిగింది అంటే: ట్రైన్ డ్రైవర్ వివరణ

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేసిన ఘటనలో రైలు లోకో పైలెట్ (డ్రైవర్) అంజాద్ హైజాక్ పరిస్థితులను వివరించారు. బీఎల్ఏ మిలిటెంట్లు తొలుత ట్రాక్ ను పేల్చివేశారని వెల్లడించారు. రైలు ఆగగానే బీఎల్ఏ ఉగ్రవాదులు దాడి ప్రారంభించారని ఆయన వివరించారు. మిలిటెంట్లు రైలు కిటికీలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారని, తాము చనిపోయామని వారు భావించారని వివరించారు. వారు అలా అనుకోవడమే తమ ప్రాణాలను కాపాడిందని అన్నారు.

Advertisements
రైలు హైజాక్ ఎలా జరిగింది అంటే: ట్రైన్ డ్రైవర్ వివరణ

కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమను రక్షించారు

దాడి తర్వాత విడుదలైన ప్రయాణికుల్లో ఒకరు మాట్లాడుతూ, పేలుడు తర్వాత దుండగులు తమను బందీలుగా చేసుకున్నారని తెలిపారు. కమాండోలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమను రక్షించారని, సైన్యం చూపిన తెగువ తమకు ధైర్యాన్నిచ్చిందని అన్నారు. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం జాఫర్ ఎక్స్‌ప్రెస్ బందీ సంక్షోభానికి ముగింపు పలికినట్లు ప్రకటించింది. నైరుతి బలూచిస్తాన్‌లో జరిగిన ఈ ఘటనలో 33 మంది దుండగులను హతమార్చినట్లు, 340 మందికి పైగా ప్రయాణికులను విడిపించినట్లు సైన్యం తెలిపింది.

బీఎల్ఏ మాత్రం సైన్యం వాదనను ఖండించింది

అయితే, బీఎల్ఏ మాత్రం సైన్యం వాదనను ఖండించింది. ఇంకా బందీలు తమ వద్దే ఉన్నారని, భద్రతా దళాలతో పోరాడుతున్నామని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, సైన్యం రక్షించినట్లు చెబుతున్న బందీలను తామే విడుదల చేశామని బీఎల్ఏ చెప్పుకొచ్చింది.

మరణించిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు

మరణించిన వారి సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైన్యం ప్రకారం 21 మంది బందీలు, నలుగురు సైనికులు మరణించారు. అయితే, బలూచిస్తాన్‌లోని రైల్వే అధికారి తెలిపిన వివరాల ప్రకారం 25 మృతదేహాలను సంఘటనా స్థలం నుండి మచ్ పట్టణానికి తరలించారు. మృతుల్లో 19 మంది సైనికులు, ఒక పోలీసు, ఒక రైల్వే అధికారి ఉన్నారని, మరో నలుగురిని గుర్తించాల్సి ఉందని ఆ అధికారి తెలిపారు.

Related Posts
Pahalgam Attack : ఇక పాకిస్థాన్‌ పౌరులకు నో వీసా
ఇక పాకిస్థాన్‌ పౌరులకు నో వీసా

పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్‌ కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ పౌరులకు వీసా సేవల్ని నిలిపివేసింది. మెడికల్‌ వీసా సహా పాక్‌ జాతీయులకు Read more

బంగ్లాదేశ్‌లో భారతీయ పర్యాటకుడిపై హింసాత్మక దాడి
Hindus in bangladesh

భారతీయ పర్యాటకుడు సయన్ ఘోష్ తన బంగ్లాదేశ్ పర్యటన అనంతరం గాయాలపాలై, తీవ్రంగా మనోవేదనకు గురై ఇండియాకు తిరిగి వచ్చారు. 21 సంవత్సరాల సయన్ ఘోష్ తన Read more

అందరిని కలచివేసిన ఫుట్బాల్ మ్యాచ్ సంఘటన
footballl

జార్జియా-ఫ్లోరిడా కాలేజీ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఎవర్బ్యాంక్ స్టేడియంలో చోటుచేసుకున్న సంఘటన అందరిని కలచివేసింది. ఈ మ్యాచ్ సమయంలో ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడ కూర్చున్న మద్దతుదారులను Read more

డ్రగ్స్ స్మగ్లర్‌ను హతమార్చిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్
డ్రగ్స్ స్మగ్లర్‌ను హతమార్చిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

మేము ప్రతీకారం తీర్చుకున్నాం: వాంటెడ్ ఇండియన్ డ్రగ్స్ స్మగ్లర్‌ను హతమార్చిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రాజస్థాన్ లో పలు కేసులలో వాంటెడ్ గా ఉన్న డ్రగ్స్ స్మగ్లర్ Read more

Advertisements
×