elon musk

నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సర్కార్‌ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫిషియెన్సీ’(డోజ్‌) విభాగం అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం కోసం మస్క్‌ అభ్యర్థిత్వానికి సంబంధించిన పిటిషన్‌ నోబెల్‌ కమిటీకి చేరింది. ఈ విషయాన్ని యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ నామినేషన్‌ను సమర్పించినట్లు వెల్లడించారు.

సేవకు పట్టం నోబెల్

ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్‌ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఈ బహుమతిని అందజేస్తారు. 1968లో స్వీడన్ బ్యాంక్ 300వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేసి, 1969 నుంచి ప్రదానం చేస్తున్నారు. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్‌గా పిలుస్తారు. నోబెల్ బహుమతులను డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోంలో ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతికి ప్రారంభంలో 1,50,782 స్వీడిష్ క్రోనార్లు ఇచ్చేవారు. ప్రస్తుతం 80 లక్షల స్వీడిష్ క్రోనార్లు (సుమారు రూ.6.7 కోట్లు) ఇస్తున్నారు. –ప్రతి ఏడాది నోబెల్ బహుమతిని ఒక్కో రంగంలో గరిష్టంగా ముగ్గురికి ఇస్తారు.

Related Posts
బంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్టు పై దాడులు
Munni Saha 5

బంగ్లాదేశ్ లో ప్రముఖ జర్నలిస్టు మున్ని సాహా శనివారం రాత్రి ధాకాలోని ఒక ఘటనలో వేధింపులకు గురయ్యారు. ఒక జనసమూహం ఆమెను చుట్టుముట్టి, ఆమెపై "తప్పుడు సమాచారం Read more

పాకిస్తాన్‌లో పోలియో వ్యాప్తి: 2024లో 55 కేసులు, సవాలుగా మారిన పరిస్థితి..
pakistan polio cases

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సుల్లో మూడు కొత్త పొలియో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకు పొలియో బాధితుల సంఖ్య Read more

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

మంచు తుఫాన్‌ బీభత్సం..2,200 విమాన సర్వీసులు రద్దు
Snow storm disaster..2,200 flights canceled

వాషింగ్టన్‌ : మంచు తుఫాన్‌లు టెక్సాస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు ‘గల్ఫ్‌ కోస్ట్‌’గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *